బంపరాఫర్ దక్కించుకున్న ‘మెంటల్ మదిలో’ దర్శకుడు !

బంపరాఫర్ దక్కించుకున్న ‘మెంటల్ మదిలో’ దర్శకుడు !

Published on Dec 14, 2017 6:00 PM IST

ఈ ఏడాది తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించిన దర్సకుల్లో యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ఒకరు. ఆయన చేసిన ‘మెంటల్ మదిలో’ చిత్రం తెలుగు ఆడియన్సును బాగా ఆకట్టుకుంది. ప్రేమ కథను కొత్తగా చెప్పిన ఆయన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఆ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి, సమర్పకులు డి. సురేష్ బాబులు కలిసి వివేక్ ఆత్రేయతో మరో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.

ఈ చిత్రానికి ఇప్పటికే ‘బ్రొచేవారెవరురా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ ను బట్టి ఇది కూడా కొత్త తరహా నరేషన్ తో, స్టోరీ లైన్ తో రూపొందబోయే సినిమా అనే అనిపిస్తోంది. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ లో నటీనటులెవరు, షూట్ ఇప్పుడే మొదలవుతుంది వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు