1400 మందితో మోహన్ బాబు సినిమాలోని పాట !

1400 మందితో మోహన్ బాబు సినిమాలోని పాట !

Published on Sep 19, 2017 2:59 PM IST


విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో రూపొందిస్తూ, నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ‘పెళ్ళైన కొత్తలో’ ఫేమ్ మదన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూట్లో ఒక పాటను చిత్రీకరించనున్నారట యూనిట్. ఈ పాత కోసం సుమారు 1400 మంది జనాన్ని ఉపయోగించనున్నారు.

వీరిలో 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు కాగా ఇంకో 400 మంచి డ్యాన్సర్లు ఉన్నారట. ప్రముఖ బాలీవుడ్ క్రొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నేతృత్వంలో ఈ పాటను రూపొందించనున్నారు. అంతేగాక ఫేమస్ సింగర్ శంకర్ మహదేవన్ ఈ పాటను పాడనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ చిన్న వేసిన భారీ సెట్స్ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిల విమల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సగం షూట్ పూర్తైన ఈ చిత్రం యొక్క ఇంకొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు