మహేష్ బాబు ‘ఆగడు’ పబ్లిసిటీ అదిరింది.

మహేష్ బాబు ‘ఆగడు’ పబ్లిసిటీ అదిరింది.

Published on Sep 13, 2014 12:12 PM IST

aagadu11
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా మరో వారంలో.. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పబ్లిసిటీని ఒక రేంజ్ లో చేస్తున్నారు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలు. భారి ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద 160 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తు గల బారి హోర్డింగ్ పెట్టారు. వైజాగ్, సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్ మీద ‘ఆగడు’ పోస్టర్లు దర్శనం ఇవ్వనున్నాయి. సరికొత్తగా, ట్రెండీగా ‘ఆగడు’ పబ్లిసిటీను ప్లాన్ చేశారు నిర్మాతలు. టీవీ, వెబ్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఇలా ఎక్కడ చూసినా ‘ఆగడు’ పబ్లిసిటీ అదిరింది.

మహేష్ బాబు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. శృతి హాసన్ తొలిసారిగా ప్రత్యేక గీతంలో హాల్ చల్ చేయనుంది. తమన్ సంగీతం అందించిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్ల మహేష్ బాబుతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు