గ్రాఫిక్స్ తక్కువ రియాలిటీ ఎక్కువ అంటున్న ప్రభాస్ !

గ్రాఫిక్స్ తక్కువ రియాలిటీ ఎక్కువ అంటున్న ప్రభాస్ !

Published on May 21, 2018 12:57 PM IST

రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క కీలక షెడ్యూల్ అబుదాబిలో జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ సారథ్యంలో యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా గురించి స్థానిక మీడియాతో మాట్లాడిన ప్రభాస్ ‘స్టంట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉండేలా చేస్తున్నాం. ఇందులోని స్టంట్స్ 90 శాతం రియల్. కేవలం 10 శాతం మాత్రమే గ్రాఫిక్స్ ఉంటాయి. ఇదివరకు ఎవరూ చూడాలని యాక్షన్ సన్నివేశాలను ఇందులో చూడొచ్చు. చిత్రీకరణ సమయంలో ఆ సన్నివేశాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. కెన్నీ బేట్స్ అన్నింటినీ వాస్తవంగా చిత్రీకరిస్తున్నారు’ అన్నారు.

ఈ చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేసుకున్న కార్లను, ట్రక్కులను వాడుతున్నారు. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే సుమారు రూ.90 కోట్లను ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. శ్రద్దా కపూర్ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు