టాప్ ప్రొడక్షన్ హౌస్ గా దశాబ్దాల చరిత్ర కలిగిన వైజయంతి మూవీస్ కొన్నాళ్ళ విరామం తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. మహానటి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన వైజయంతి అధినేత అశ్వినీ దత్ భారీ హిట్ అందుకున్నారు. ఆ చిత్రం తరువాత నాగ్ మరియు నాని ల మల్టీ స్టారర్ దేవదాస్ నిర్మించారు. గత ఏడాది మహేష్ నటించిన మహర్షి సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. కాగా ఈ నిర్మాణ సంస్థ నుండి నేడు ఓ సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ రానుంది.
ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ విషయం తెలియజేశారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తున్నట్లు ఈ సంస్థ గతంలో ప్రకటించింది. మరి ఆ భారీ చిత్రానికి సంబంధిన అప్డేట్ ఏమైనా ఇవ్వనున్నారేమో చూడాలి.
A Surprise coming your way in just a few hours.
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 26, 2020