ప్రభాస్ 21 కోసం ఆయన భారీగా అడుగుతున్నారట.

ప్రభాస్ 21 కోసం ఆయన భారీగా అడుగుతున్నారట.

Published on Aug 4, 2020 9:29 AM IST

దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఓ భారీ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషలలో విడుదలకానున్న ఈ చిత్ర బడ్జెట్ కూడా 500కోట్లకు పై మాటే అని తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022 లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె నటించడం విశేషం. మొదటిసారి దీపికా ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టడం మరో విశేషం.

ప్రతిదీ గ్రాండ్ గా దర్శకుడు ప్లాన్ చేస్తుండగా, మ్యూజిక్ కొరకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ ని తీసుకోనున్నారట. దీనిపై వీరిమధ్య చర్చలు జరగడం, ఆయన ఓకే చేయడం కూడా జరిగిపోయిందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ కోసం రహ్మాన్ భారీగా అడిగినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఆయనపట్ల సుముఖంగా ఉన్నారట. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వినీ దత్ ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు