ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో కోన వెంకట్ సినిమా !

ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో కోన వెంకట్ సినిమా !

Published on May 21, 2018 1:32 PM IST

కేవలం హీరోగా మాత్రమే కాక సపోర్టింగ్ రోల్స్ కూడ చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఆది పినిశెట్టి. ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చిత్రంలో ఆయన నటనకుగాను గొప్ప ఫీడ్ బ్యాక్ లభించింది. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో ఒక సినిమాను నిర్మించబోతున్నారు కోన వెంకట్. ఎంవివి. సినిమా బ్యానర్ కూడ ఈ నిర్మాణంలో పాలుపంచుకోనుంది.

ఈ చిత్రంలో తాప్సి, రితిక సింగ్ లు కూడ నటించనున్నారు. గతంలో కోన వెంకట్ ఆది నటించిన ‘నిన్ను కోరి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది కూడ. ఇకపోతే ఈ సినిమా యొక్క టైటిల్ ను జూన్ 24న హీరో నాని రివీల్ చేయనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, ఇతర సాంకేతిక నిపుణులు, తారాగణం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు