‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తమిళ రీమేక్లో ఆది..!

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తమిళ రీమేక్లో ఆది..!

Published on Sep 1, 2014 10:05 AM IST

rahulprith-sing
సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెలుగులో మంచి విజయం సాదించిన సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకేక్కడంతో ఇతర భాషల దర్శకనిర్మాతలు రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కన్నడలో ‘తిరుపతి ఎక్స్ ప్రెస్’ పేరుతో రీమేక్ చేశారు. తాజాగా ఈ సినిమా తమిళ ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యింది.

‘గుండెల్లో గోదారి’, ‘వైశాలి’ సినిమాల హీరో ఆది పినిశెట్టి తమిళ రీమేక్లో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు ఆది సోదరుడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహిస్తారు. ఆదర్శ చిత్రలయా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. కెరీర్ ఆరంభం నుండి ఎక్కువగా సీరియస్ తరహా పాత్రలు పోషించిన ఆది నటిస్తున్న ఫస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా కావడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు