’బ్రహ్మోత్సవం’ నైజాం హక్కులను స్వంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్..!

’బ్రహ్మోత్సవం’ నైజాం హక్కులను స్వంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్..!

Published on Apr 28, 2016 5:25 PM IST

bramhotsavam-m
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలయికలో వస్తోన్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు విడుదల చేసిన మోషన్ పోస్టర్ బాగా ఆకట్టుకుంది. అలాగే మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మోత్సవం’ ఆడియోను మే 7 న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ఎంతో క్రేజ్ ఉన్న ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ అయిన అభిషేక్ పిక్చర్స్ స్వంతం చేసుకున్నట్లు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి స్వయంగా వెల్లడించారు. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రధానంగా చేసుకొని తెరకెక్కినట్లు సమాచారం. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 20 న భారీ స్థాయిలో విడుదల కాబోతున్నది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు