కెరియర్ మలుపు తిరిగే ఛాన్స్ అందుకున్న నటి

కెరియర్ మలుపు తిరిగే ఛాన్స్ అందుకున్న నటి

Published on Feb 24, 2020 3:35 PM IST

బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. పలు భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రాన్ని అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఈ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలున్నాయి. ఇలాంటి క్రేజీ చిత్రంలో నటించే అవకాశం రావడమంటే లక్కీ అనే అనుకోవాలి.

ఇప్పుడీ లక్ సౌత్ నటి పూర్ణకు దక్కింది. కెరీర్ ఆరంభంలో మలయాళ చిత్రాలు చేసినా ఆ తర్వాత తెలుగులో ‘సీమ టపాకాయ్, అవును, రాజుగారి గది’ లాంటి చిత్రాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న పూర్ణ ఆ తర్వాత వరుస పరజయాలతో నిరుత్సాహానికి గురైంది. తమిళంలో అవకాశాలు వచ్చినా గుర్తుంచుకోదగిన విజయాలు దక్కలేదు. ఇలాంటి తరుణంలో ఆమెకు ‘తలైవి’లో ఒక కీ రోల్ చేసే ఛాన్స్ దొరికింది. ఈ అవకాశం రావడం పట్ల పూర్ణ చాలా ఎగ్జైట్ అవుతోంది. ఈ చిత్రం గనుక హిట్టైతే ఆమె కెరియర్ మరోసారి మలుపు తిరగడం ఖాయం. ఇకపోతే జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న చిత్రం జూన్ 26న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు