1920 అనే బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన భామ అదా శర్మ. ఆ తర్వాత కొన్నాళ్ళకు హార్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తన అందం, నటనతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా సన్నాఫ్ సత్యమూర్తి విజయంతో తెలుగులో బిజీబిజీగా మారిపోయింది. ప్రస్తుతం క్షణం, గరమ్ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్న అదా శర్మ ఓ ప్రమాదానికి గురై గాయాల పాలైందని వార్తలు వచ్చాయి.
షూటింగ్ సమయంలో అదా శర్మను ఓ బస్ ఢీకొందని, ఈ ప్రమాదంలో గాయాలపాలైన ఆమె హాస్పిటల్లో చేరిందని పుకార్లు పుట్టాయి. ఈ పుకార్లను అదా శర్మ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఖండించింది. తనకు ఏ ప్రమాదమూ జరగలేదని, చాలా బాగున్నానని, పుకార్లను నమ్మవద్దని తెలిపింది. అదా శర్మకు ప్రమాదం జరిగిందనే వార్త పుకారని తేలిపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన నుంచి బయటకు వచ్చారు.
I was shooting on a bike yesterday.I'm totally fine .In one piece.Alive.Tweeting this immediately so that rumours won't spread.no bus hit me
— Adah Sharma (@adah_sharma) May 27, 2015