మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కి కరోనా !

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కి కరోనా !

Published on Jul 12, 2020 3:12 PM IST

బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే అమితాబ్ కు అభిషేక్ కు సోకిన కరోనా సోకడంతో వారు నానావతీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అమితాబ్ మిలియన్ల మంది అభిమానులు మరియు భారతీయ చలనచిత్ర ప్రముఖులు ఆయన ఆరోగ్య నివేదికల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే అమితాబ్‌తో పాటు ఆసుపత్రిలో చేరిన అభిషేక్ బచ్చన్ కూడా స్థిరంగా మరియు బాగా కోలుకుంటున్నారు. ఇక ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య కూడా నానావతీ హాస్పిటల్ లో చేరారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి దులారీ ఖేర్కు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన సోదరుడి కుటుంబానికి కూడా మహమ్మారి సోకింది. ఈ విషయాన్ని అనుపమ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు