యువ హీరో అక్కినేని అఖిల్ తెలంగాణా ప్రీమియర్ కబడీ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్నీ ప్రీమియర్ లీగ్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన కబడ్డీ విస్తరణకు తెలంగాణా తరపున ఈ లీగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే యువ హీరోల్లో ఎవరినైతే ఎంచుకుంటే బాగుంటుందని చర్చించి అఖిల్ ని ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం 8 టీమ్స్ పాల్గొనబోయే ఈ లీగ్ జనవరి 21 నుండి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది.
మొత్తం 112 మంది ఆటగాళ్లు ఆడనున్న ఈ లీగ్ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో జరగనుంది. గతంలో రానా, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ప్రో కబడ్డీ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇకపోతే అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా కోసం వర్కవుట్స్ చేస్తూ సంసిద్దమవుతున్నాడు.