నాగార్జున క్రేజీ షోకు గెస్ట్‌గా అఖిల్

నాగార్జున క్రేజీ షోకు గెస్ట్‌గా అఖిల్

Published on Nov 26, 2015 9:11 PM IST

Akhil-nagarjuna
కింగ్ నాగార్జున హోస్ట్‌గా తెలుగులో వచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షో ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలిసిందే. రెండు సీజన్స్‌గా వచ్చిన ఈ షోకు ఆ తర్వాత నాగార్జున కొన్నాళ్ళపాటు బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్‌లో తన రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేసిన నాగ్, తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడు షోను మళ్ళీ ప్రారంభించనున్నారు. ఈ మూడో సీజన్‌ రేపు సాయంత్రం జరిగే కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమవుతుంది. రెండు సీజన్స్‌లో అందరినీ విపరీతంగా అలరించిన నాగార్జున మూడో సీజన్‌లోనూ సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు.

ఇక ఇప్పటికే మూడో సీజన్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలన్నీ భారీ ఎత్తున చేపట్టారు. ఈమధ్యే ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్, ఈ షోను రేపు ప్రారంభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. తన మొదటి సినిమాలో డ్యాన్సులు, ఫైట్స్‌తో ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్న అఖిల్, తండ్రి నాగార్జునతో కలిసి రేపు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు