థాయ్‌ల్యాండ్ షెడ్యూల్ పూర్తి చేసిన అఖిల్..!

థాయ్‌ల్యాండ్ షెడ్యూల్ పూర్తి చేసిన అఖిల్..!

Published on Jul 3, 2015 2:14 PM IST

akhil
అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం థాయ్‌ల్యాండ్‌లో ఓ షెడ్యూల్‌ స్టార్ట్ చేసిన అఖిల్ సినిమా టీమ్ ఆ షెడ్యూల్‌ను నేడు పూర్తి చేసింది. ఇక దీంతో 70% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగమంతా మరికొన్ని నెలల్లో పూర్తి కానుంది.

అక్కినేని వంశంలో మూడో తరంలో పరిచయమవుతోన్న అఖిల్ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రూపొందుతున్నట్లు నితిన్, వి.వినాయక్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే! తాజాగా తనపై చూపుతున్న ప్రేమకు అఖిల్ అభిమానులకు ఓ లేఖ కూడా రాసి వారిని ఆనందింపజేశారు. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ – తమన్‌లు సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు