దేశంలోనే నంబర్ వన్ స్టార్..!

దేశంలోనే నంబర్ వన్ స్టార్..!

Published on Jun 5, 2020 2:44 PM IST

తాజాగా వరల్డ్ ఫేమస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వార్షిక జాబితాలో అత్యధిక పారితోషికం పొందిన 100 మంది ప్రముఖుల్లో భారత్‌ నుంచి బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే చోటుదక్కింది. జూన్‌ 2019 నుంచి మే 2020 వరకూ దాదాపు రూ .366 కోట్ల సంపాదనతో అక్షయ్ కుమార్ ప్రపంచంలోనే అత్యంత రాబడి కలిగిన టాప్‌ 100 సెలబ్రిటీల సరసన చేరారు. అమెరికాకు చెందిన కైలీ జెన్నర్‌ రూ 4453 కోట్ల ఆర్జనతో అగ్రస్ధానంలో నిలిచింది. ఈ జాబితాలో అక్షయ్‌ కుమార్‌కు 52వ స్దానం లభించింది.

ఐతే గత ఏడాదితో పోల్చుకుంటే అక్షయ్‌ రాబడి మరియు ర్యాంకింగ్ పరంగా వెనుక బడ్డాడు. గత ఏడాది ఆయన సంపాదన రూ 490 కోట్లు కాగా ఆయన సంపాదనపై కరోనా వైరస్ ప్రభావం పడిందని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది. అమెజాన్‌ ప్రైమ్‌తో అక్షయ్‌ కుమార్‌ జత కట్టడం ఈ ఏడాది జాబితాలో చోటుదక్కేందుకు కలిసొచ్చింది. ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాలు చేయడం, వ్యాపార ప్రకటనలలో నటించడం అక్షయ్ కి కలిసి వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు