అందరి చూపులు ‘బాహుబలి’ వైపే.!

అందరి చూపులు ‘బాహుబలి’ వైపే.!

Published on Jun 29, 2015 8:39 AM IST

Baahubali-pposter

ఇండియన్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా నాలుగు భాషల్లో అత్యంత భారీగా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ చిత్ర టీం మలయాళంలో ఆడియో లాంచ్ చేయడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ పోస్టర్ ని లాంచ్ చేసారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర మెయిన్ టీం అయిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు సౌత్ ఇండియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు మిగిలిన భాషల వారి చూపు కూడా బాహుబలి పైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, పోస్టర్స్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇండియా మొత్తం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న సినిమా బాహుబలి. దానికి ప్రధాన కారణం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మొత్తం మొదటి విజువల్ వండర్ మరియు బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ కావడం విశేషం. కరణ్ జోహార్ హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు