మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వచ్చేస్తుందా? ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అన్న ఉత్సాహంతో మెగా అభిమానులంతా కొద్దికాలంగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పకడ్బందీగా పూర్తి చేసుకున్న సినిమా డిసెంబర్ 9న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇక విడుదలకు ఇంకా కొద్దిసమయమే ఉండడంతో టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఈ క్రమంలోనే నేడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ను పెద్ద ఎత్తున జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
హైద్రాబాద్లోని యూసుఫ్గూడ పోలీస్ లైన్స్లో జరుగుతోన్న ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. పోలీసుల గొప్పదనాన్ని చూపే సినిమా కావడంతో సాధారణంగా సినిమా ఫంక్షన్లు జరిగే ప్రాంతంలో కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను పోలీసుల క్వార్టర్స్ అయిన యూసుఫ్గూడ పోలీస్ లైన్స్లో నిర్వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లైవ్ ఇక్కడ చూడొచ్చు.