రీమేక్ సినిమా చేయనున్న అల్లు శిరీష్ !

రీమేక్ సినిమా చేయనున్న అల్లు శిరీష్ !

Published on Apr 24, 2018 12:20 PM IST

హీరో అల్లు శిరీష్ చివరగా చేసిన చిత్రం ‘ఒక్క క్షణం’ మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఒక మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. అదే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి ( అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రం.

నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. జూన్ నుండి షూటింగ్ మొదలుకానుంది. ఇందులో అమెరికాలో పుట్టిన ఒక కుర్రాడు ఇండియా వచ్చి బలవంతం మీద ఎలా డిగ్రీ చేస్తాడు అనేదే ఈ సినిమా కథ. కథ మొత్తం హీరో పాత్ర యొక్క జర్నీ మీదే నడుస్తుంటుంది. ఇకపోతే ఈ చిత్రంలో ఇతర నటీనటులెవరు, నిర్మాతలెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు