అక్కడ ‘సరైనోడు’ పరిస్థితి ఏంటి ?

అక్కడ ‘సరైనోడు’ పరిస్థితి ఏంటి ?

Published on May 28, 2016 9:25 AM IST

sarrainodu
అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన ’సరైనోడు’ బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాని తెలుగు వెర్షన్ విడుదల అయిన వారం తరువాత మళయాలం వెర్షన్ విడుదల చేయాలనుకున్నా కొన్ని కారణాల వలన అది జరగలేదు. దాదాపు ​80 థియేటర్స్ లో అల్లు అర్జున్ ‘యోధావు’ (‘సరైనోడు’ మళయాలం వెర్షన్ )కేరళలో నిన్న విడుదలైనది.

కేరళలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలిసింది. ఈ సినిమాకి కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు కూడా వేసినట్టు సమాచారం. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి త‌న శైలిలో ఫైట్లు, డైలాగులు చిత్రీకరించిన విధానానికి మళయాలం అభిమానుల నుంచి కూడా మంచి స్పందన లభించడంతో కేరళలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ సినిమాని అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిన్న కేరళలోని తిరువనంతపురం లో అల్లు అర్జున్ అభిమానుల తో కలిసి చూడటం విశేషం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కాథరీన్ థ్రెసా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు