తమ సినిమా ఏ సినిమాకీ కాపీ కాదంటున్న అల్లు శిరీష్ !

తమ సినిమా ఏ సినిమాకీ కాపీ కాదంటున్న అల్లు శిరీష్ !

Published on Dec 18, 2017 9:47 AM IST

ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా దర్శకుడు విని ఆనంద్ ‘ఒక్క క్షణం’ అనే సినిమాని రూవుపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శిరీష్ తమ సినిమా పై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా కొరియన్ సినిమా స్ఫూర్తిగా రూపొందుతోందని వార్తలొచ్చాయి.

అంతేగాక సదరు కొరియన్ సినిమా రీమేకే హక్కులను కొన్న నిర్మాత అనిల్ సుంకర అదే ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్ తో ‘2 మేమిద్దరం’ అనే సినిమా చేస్తున్నారు. దీంతో తమ సినిమాను కాపీ కొట్టారంటూ అయన ‘ఒక్క క్షణం’ పై ఫిల్మ్ చాంబర్లో పిర్యాదు కూడా చేశారని గుసగుసలు వినబడ్డాయి.

కానీ తమ ఏ సినిమాకీ కాపీ కాదని, ఆ కొరియన్ సినిమాను తాను కూడా చూశానని, విడుదలయ్యాక ఆ విషయం అందరికీ తెలుస్తుందని శిరీష్ అన్నారు. విఐ ఆనంద్ కూడా తాము సొంత కథతోనే సినిమా చేస్తున్నామని అన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఈ డిసెంబర్ 28న రిలీ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు