షూటింగ్ ముగించేసిన అల్లు శిరీష్!

షూటింగ్ ముగించేసిన అల్లు శిరీష్!

Published on Jan 21, 2017 4:45 PM IST

allu-sirish-in
కెరీర్లో మొదటిసారి ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్ ఒక అడుగు ముందుకేస్తూ మలయాళం చిత్రానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం మరో పెద్ద విశేషం. దర్శకుడు మేజర్ రవి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 1971ల కాలంలో ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నైపథ్యంలో రూపొందిన కథ కావడంతో ఈ సినిమాకి ‘1971 బియాండ్ బోర్డర్స్’ పేరును నిర్ణయించారు.

పంజాబ్, కాశ్మీర్, రాజస్థాన్ యుగాండా వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా కోసం నిన్నటి వరకు అల్లు శిరీష్ పొలాచ్చిలో పాటల షూట్లో పాల్గొన్నాడు. ఆ పాట పూర్తవడంతో సినిమాలో శిరీష్ పై జరగాల్సిన షూట్ ముగిసింది. ఇదే విషయాన్ని శిరీష్ చెబుతూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు మేజర్ రవికి, మోహన్ లాల్ గారికి నా కృతజ్ఞతలు, ఈ ప్రాజెక్ట్ నాకో గొప్ప అనుభవం అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు