సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అల్లుడు శీను’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అల్లుడు శీను’

Published on Jul 22, 2014 3:59 PM IST

Alludu-Seeenu

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతూ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అల్లుడు శీను’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 25న విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నిన్ననే చూసిన సెన్సార్ వారు ఇంకా ఫైనల్ సర్టిఫికేట్ ఇష్యూ చెయ్యలేదు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ని అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

ఇదొక యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కావడం వలన యాక్షన్ సీన్స్ లో ఎక్కడన్నా కట్స్ వచ్చే అవకాశం ఉందని ఈ చిత్ర టీం భావిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ మూవీలో కామెడీ కింగ్ బ్రహ్మానందం కీలక పాత్ర పోషించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తి సెన్సార్ డీటైల్స్ ని మరి కొద్ది సేపట్లో అందిస్తాం.. దానికోసం 123తెలుగు.కామ్ సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు