సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అమీ తుమీ’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అమీ తుమీ’ !

Published on May 24, 2017 5:06 PM IST


గతేడాది ‘జెంటిల్మెన్’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సంవత్సరం చేసిన ‘అమీ తుమీ’. ప్రకటించిన తేదీ నుండి అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కేవలం 31 రోజుల వర్కింగ్ డేస్ తో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఆ తర్వాతి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా చాలా వేగంగా జరుపుకున్న ఏ చిత్రం తాజాగా ముఖ్యమైన సెన్సార్ కార్యక్రమాల్ని కూడా ముగించేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో జూన్ 9వ తేదీన రిలీజ్ కానున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయింది. శ్రీనివాస్ అవసరాల, అడివి శేష్, ఈషా, అదితి మాయకల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కెసి నరసింహారావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు