పర్యావరణ పరిరక్షణలో పచ్చని చెట్లే కీలకమని, వాతావరణ సమతుల్యత కాపాడటంలో చెట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని.. అందరికీ తెలుసు. కానీ ఓ మొక్క నాటడానికే మనలో చాలామందికి టైం సరిపోదు. అయితే కొంతమంది ప్రముఖులు మాత్రం మొక్కలు నాటుతూ ఇతర ప్రముఖులకు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మహిళా స్టార్ యాంకర్ సుమ కనకాల, తాజాగా ఎన్టీఆర్ ముందు గ్రీన్ ఛాలెంజ్ ఉంచారు.
ఇంతకీ ఈ గ్రీన్ ఛాలెంజ్ ఏంటంటే.. తెలంగాణ పార్లమెంట్ సభ్యుడు సంతోష్ కుమార్ మొక్కలు నాటే గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు భాగమవుతున్నారు. అలా మొక్కలు నాటిన సీనియర్ నటి జయసుధ, సుమకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసిన ఆమె ఎన్టీఆర్, మంచు లక్ష్మితోపాటు బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, ఓంకార్ లకు కూడా గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఎలాగూ మొక్కల విలువ చెప్పే కథాంశంతో ఏకంగా ‘జనతా గ్యారేజ్’ అనే సినిమానే తీసిన తారక్, ఈ ఛాలెంజ్ అంగీకరించకుండా ఉండడు.