ఆ కథకు దర్శకుడు ఆయన కాదు !

ఆ కథకు దర్శకుడు ఆయన కాదు !

Published on Dec 18, 2017 3:50 PM IST

కళ్యాణ్ రామ్ సినిమా ‘అసాధ్యుడు’తో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ అనే సినిమా తీసిన అనిల్ కన్నెగంటి ఈ మద్య సందీప్ కిషన్ హీరోగా రన్ సినిమాకు దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ డైరెక్టర్ రైటర్ గా సక్సెస్ అయ్యాడు. అనిల్ ఇటీవల అల్లు అర్జున్ కు ఒక కథ చెప్పడం జరిగింది. ఆ కథ బన్నికి బాగా నచ్చిందంట.

తాజా సమాచారం మేరకు ఈ కథ కు అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించడం లేదని తెలుస్తోంది. స్టోరి నచ్చడంతో అనిల్ కు కొంత పారితోషకం ఇచ్చిన బన్ని ఆ కథను వేరే దర్శకుడితో చెయ్యబోతున్నాడని టాక్. ప్రస్తుతం ‘నా’పేరు సూర్య’ సినిమాలో నటిస్తున్న బన్ని ఈ సినిమా తరువాత విఐ.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. విఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఒక్క క్షణం’ డిసెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు