నటకిరీటి క్రేజీ మూవీకి సీక్వెల్ రానుందా.?

నటకిరీటి క్రేజీ మూవీకి సీక్వెల్ రానుందా.?

Published on Aug 27, 2015 7:00 PM IST

rajendra-prasad
1980లలో డిఫరెంట్ డిఫరెంట్ కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మెప్పించిన హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. అలాంటి నటకిరీటి కెరీర్లో మైలురాయిగా నిలిచే సూపర్ హిట్ సినిమా ‘లేడీస్ డైరెక్టర్’. రొటీన్ సినిమా ఫార్మాట్ కి చాలా డిఫరెంట్ గా వచ్చిన ఈ సినిమాకి వంశీ డైరెక్టర్. వంశీ – రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ఓ క్లాసిక్ సినిమా ఇది. ఇప్పుడు వంశీ ఈ సినిమాకి సీక్వెల్ ని చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమాకి ‘ఫ్యాషన్ డిజైనర్ – సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు.

ఆలాగే ఈ సినిమాలో హీరోగా, రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా యంగ్ హీరో రాజ్ తరుణ్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. అప్పట్లో ఆ సినిమాకి కథా సహకారం చేసిన తనికెళ్ళ భరణి చాలా రోజుల తర్వాత ఈ సీక్వెల్ కి కథని అందిస్తున్నాడు. అలాగే వంశీ సినిమాలను, కథలను అమితంగా ఇష్టపడే మధుర శ్రీధర్ ఈ సినిమాని తన ఓన్ బ్యానర్ లో నిర్మించడానికి సిద్దమయ్యాడు. అప్పట్లో డిఫరెంట్ కామెడీతో తెగ నవ్వించిన వంశీ ఈ సినిమాతో కూడా తెగ నవ్విస్తాడని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు