రవితేజ కొత్త చిత్రం నుండి తప్పుకున్న అను ఇమ్మాన్యుయేల్ !

రవితేజ కొత్త చిత్రం నుండి తప్పుకున్న అను ఇమ్మాన్యుయేల్ !

Published on May 20, 2018 11:08 AM IST

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం’ అమర్ అక్బర్ ఆంటోనీ ‘. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని ఒకరు అను ఇమ్మాన్యుయేల్ కాగా మరో హీరోయిన్ గా శ్రుతీ హాసన్ ను అనుకుంటున్నారని మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు .

ప్రస్తుతం ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే సినిమాలో నటిస్తుండడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి 50 రోజులు పనిచేయల్సి రావడం వల్ల డేట్స్ కేటాయించలేక పోతున్నానని అందుకే ఈ సినిమాను నుండి వైదొలుగుతున్నట్లుగా అను ప్రకటించింది. ఈ సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు