నాగ్ – కార్తీల మల్టీస్టారర్ లో అనుష్కకి చోటు?

నాగ్ – కార్తీల మల్టీస్టారర్ లో అనుష్కకి చోటు?

Published on May 27, 2015 2:35 AM IST

anushka
నాగార్జున – కార్తీలు కలిసి చేయబోయే మల్టీ స్టారర్ పై సౌత్ ఇండస్ట్రీ కళ్ళంతా వున్నాయనడం అతిశయోక్తి కాదు. పి.వి.పి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో తారాగణం రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది. ముందుగా ఈ చిత్రంలో ప్రధాన నాయిక పాత్రకు శృతిహాసన్ ని ఎంపిక చేసారు. ఈమె ఇప్పుడు ఈ చిత్రంలో ముఖ్యపాత్ర వహించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రకు అనుష్కని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రంలో రానున్న ప్రధాన సన్నివేశాలకు భారీ తారాగణం వుంటే సినిమాను మరొక ఎత్తుకి తీసుకెళ్ళచ్చని చిత్ర బృందం అభిప్రాయం. అనుష్క ప్రస్తుతం పి.వి.పి సంస్థలోనే ‘సైజ్ జీరో’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ జూన్ 14న ప్రారంభంకానుంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు