‘నిశ్శబ్దం’లో.. సస్పెన్స్ ఎలిమెంట్స్ హైలెట్ అట !

‘నిశ్శబ్దం’లో.. సస్పెన్స్ ఎలిమెంట్స్ హైలెట్ అట !

Published on Sep 17, 2019 3:33 PM IST

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. తెలుగులో ఈ సినిమా ‘నిశ్శబ్దం’గా రానుంది. కాగా ఈ సినిమాలో సప్సెన్స్ ఎలిమెంట్స్ చాల బాగా వచ్చాయని.. సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ అండ్ ట్విస్ట్ లు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. ఇక ఇటివలే ఈ సినిమా నుండి ‘సాక్షి ఏ మ్యూట్ ఆర్టిస్ట్’ అనే క్యాప్సన్ తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. ఇక మాధవన్ ఈ సినిమాలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడట. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట.

ఇక ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు