విలన్ కోసం 5 కోట్లు ఆఫర్ చేసిన చరణ్ టీం

విలన్ కోసం 5 కోట్లు ఆఫర్ చేసిన చరణ్ టీం

Published on Nov 26, 2015 5:00 PM IST

ram-charan-aravind-swami
దసరా కానుకగా రిలీజ్ చేసిన ‘బ్రూస్ లీ’ సినిమాతో మెగా అభిమానులను మెప్పించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హాలిడే మూడ్ లో ఉన్నాడు. రామ్ చరణ్ తదుపరిగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ రీమేక్ లో నటించనున్నాడు. సురేందర్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ చేసి జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి పోటీగా నిలిచే విలన్ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంది.

అందులో భాగంగానే తమిళంలో విలన్ గా చేసిన అరవింద్ స్వామి అయితేనే తెలుగులోనూ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ఆయన్నే అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవ్వడమే కాకుండా అరవింద్ స్వామిని ఒప్పించడం కోసం భారీ అమౌంట్ ని ఆ ఆఫర్ చేసారు. ఆ అమౌంట్ ఎంతంటే అక్షరాల 5 కోట్లు. కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే 5 కోట్ల ఆఫర్ ఇచ్చినా అరవింద్ స్వామి తెలుగు వెర్షన్ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం చరణ్ తెమ అండ్ అరవింద్ స్వామి మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. అల్లు అరవింద్ – ఎన్.వి ప్రసాద్ లు కలిసి ఈ సినిమాని నిర్మించే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు