ఈ మధ్య కాలంలో విడుదలైన ‘ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, ఆనందో బ్రహ్మ’ వంటి సినిమాలు మంచి విజయాల్ని, లాభసాటి కలెక్షన్లు సాధించగా ఆ సక్సెస్ ను కొనసాగించడానికి అన్నట్లు ‘అర్జున్ రెడ్డి’ చిత్రం గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నూతన దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో ‘విజయ్ దేవరకొండ’ నటించిన ఈ సినిమా మొదట మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.15 కోట్లు వసూలు చేసింది.
ప్రాంతాల వారీగా వసూళ్ల వివరాలను చూస్తే
ఏరియా | కలెక్షన్స్ |
నైజాం | 3.58 కోట్లు |
సీడెడ్ | 95 లక్షలు |
నెల్లూరు | 18 లక్షలు |
గుంటూరు | 45 లక్షలు |
కృష్ణా | 55 లక్షలు |
వెస్ట్ గోదావరి | 25 లక్షలు |
ఈస్ట్ గోదావరి | 54 లక్షలు |
వైజాగ్ | 65 లక్షలు |
మొత్తం |
7. 15 కోట్లు |