‘అర్జున్ రెడ్డి, విఐపి-2’ కృష్ణా జిల్లా వసూళ్లు !

‘అర్జున్ రెడ్డి, విఐపి-2’ కృష్ణా జిల్లా వసూళ్లు !

Published on Aug 30, 2017 10:18 AM IST


గత వారం విడుదలైన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం బ్రహ్మాండమైన వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. రిలీజైన ప్రతి చోట చిత్రం లాభాల దిశగా వెళుతోంది. ఏపి, తెలంగాణల్లో అయితే మొదటి మూడు రోజులకు కలిపి రూ.7.15 కోట్లు రాబట్టిన ఈ సినిమా కృష్ణా జిల్లాలో 6వ రోజు కూడా రూ.6. 96 లక్షలు రాబట్టి మొత్తంగా 6 రోజులకు కలిపి రూ.70.29 లక్షల షేర్ ను వసూలు చేసింది.

ఇక ఇదే ఏరియాలో మరొక చిత్రం ‘జయ జానకి నాయక’ 19 వ రూ .30,725 వసూలు చేసి మొత్తంగా రూ. 1.27 కోట్ల షేర్ ను నమోదుచేసింది. ఇక డబ్బింగ్ చిత్రం ‘విఐపి-2’ 5వ రోజు రూ.1.91 లక్షల షేర్ ను రాబట్టి 5 రోజులకు కలిపి రూ. 22.72 లక్షల షేర్ ను ఖాతాలో వేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు