‘బాహుబలి’ అభిమానులకు ఈనెల 31వ తేదీ విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాము ఎంతగానో ఎదురుచూస్తూన్న బాహుబలి ట్రైలర్, ఆడియోలను ఆరోజే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్, ఆడియో కోసం ఇప్పట్నుంచే సిద్ధమైన అభిమానులకు ఇది చేదు వార్త. బాహుబలి ఆడియో రిలీజ్ వేడుకను వాయిదా వేశారు.
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక వాయిదా పడింది. హైద్రాబాద్లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్లో అభిమానుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో పోలీసుల అనుమతి ఇంకా రానందునే ఆడియో రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఉదయం 10:30 గంటలకు ఆడియో రిలీజ్ వాయిదా విషయమై రాజమౌళి ప్రెస్మీట్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త రిలీజ్ డేట్ను ఈ సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు.
దర్శకుడు రాజమౌళికి ఆడియో రిలీజ్ను వినూత్నంగా, కొత్త పంథాలో నిర్వహించడం వెన్నతో పెట్టిన విద్య. ‘మగధీర’ సినిమా నుంచి ఈ తరహా ఆడియో రిలీజ్తో సినిమాపై క్రేజ్ను అమాంతం పెంచేసే టెక్నిక్ను వాడుకుంటూ వస్తున్నారు రాజమౌళి. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు కూడా అదే రేంజ్లో ఆడియో రిలీజ్ను నిర్వాహించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో, ఆ ఆడియో రిలీజ్ వేడుక ఏ స్థాయిలో అలరిస్తాయా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మరికొంత కాలం వెయిటింగ్ తప్పేలా లేదు.