భాగ్యనగరంలో మొదలైన బాహుబలి సందడి

భాగ్యనగరంలో మొదలైన బాహుబలి సందడి

Published on Jul 3, 2015 3:21 PM IST

Baahubali-pposter
బాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసిన బాహుబలి ప్రమోషన్స్ హంగామా హైదరాబాద్ ని తాకింది. ఇన్ని రోజులు అడపాదడపా తెలుగులో ప్రమోషన్స్ చేస్తూ ఉన్నా హిందీ, తమిళ్, మలయాళంలో భారీ ఎత్తున ప్రమోట్ చేసారు. నేటి నుంచి బాహుబలి టీం హైదరాబాద్ లో ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేయనుంది. ఇప్పటికే ప్రభాస్, రానా, తమన్నాలు కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. రానున్న వారం రోజులు పలు ప్రమోషనల్ యాక్టివిటీస్ తో ఈ చిత్ర టీం బిజీ కానుంది.

మరో రెండు రోజుల్లో ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ రెడీ కానుంది. అనౌన్స్ చేసిన నాటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూలై 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. అప్పుడే సోషల్ మీడియాలో ఈ సినిమా బెనిఫిట్ షోస్ మరియు వాటి టికెట్స్ గురించిన హంగామా మొదలైపోయింది. మరికొంతమంది అభిమానులైతే బాహుబలిసినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందని అందులో ఎలాంటి అనుమానం లేదనే స్టేట్మెంట్స్ తో హోర్డింగ్స్ ని రెడీ చేస్తున్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్య రాజ్, సుధీప్, నాజర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. జూలై 3 కల్లా ఫైనల్ కాపీని సిద్దం చేయనున్న ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు