ఒక నెల షెడ్యూల్ కోసం బల్గేరియా వెళ్లనున్న ‘బాహుబలి’

ఒక నెల షెడ్యూల్ కోసం బల్గేరియా వెళ్లనున్న ‘బాహుబలి’

Published on Oct 29, 2014 10:23 PM IST

Baahubali
సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న టాలీవుడ్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ పీరియాడిక్ మూవీలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమై, ఒక సంవత్సరం పై నుంచి సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ నెలాఖరు కల్లా రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ పూర్తవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం నవంబర్ 1 నుంచి ఒక నెలపాటు జరిగే లాంగ్ షెడ్యూల్ కోసం బల్గేరియా వెళ్లనున్నారు. అక్కడ ఈ సినిమాలోని కొన్ని కీలక ఎపిసోడ్స్ తో పాటు పాటలను కూడా షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు పాల్గొననున్నారు. ఈ సంవత్సరం చివరి కల్లా షూటింగ్ ని పూర్తి చేసి ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సెకండ పార్ట్ ని కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చెయ్యనున్నారు.

ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు