మహాబలేశ్వరంలో ‘బాహుబలి’..

మహాబలేశ్వరంలో ‘బాహుబలి’..

Published on Aug 23, 2014 8:00 AM IST

baahubali

రామోజీ ఫిల్మ్ సిటీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ‘బాహుబలి’ షూటింగ్ శుక్రవారంతో పూర్తయింది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఆగస్ట్ 26, మంగళవారం నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. మహాబలేశ్వరంలో షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత వచ్చే నెల 15 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలుపెడతారు.

దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాను భారి బడ్జెట్ తో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ 2015 ప్రధమార్ధంలో విడుదల కానుంది. తమిళంలో ‘మహాబలి’ పేరుతో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు