టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’ పార్ట్ 1

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’ పార్ట్ 1

Published on Jan 25, 2015 2:44 PM IST

Bahubali
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక గ్రాఫికల్ మానియా ‘బాహుబలి’. రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ కి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం 2 పాటల సాంగ్ షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బాలన్స్ ఉన్నాయి.

ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ‘నిన్నటితో ఫస్ట్ పార్ట్ కి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. పాచ్ వర్క్ మరియు రీ షూట్ కూడా పూర్తయ్యింది. పార్ట్ 1 లో 2 సాంగ్స్ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పైకి ఫిక్స్ షిఫ్ట్ చేసామని’ ట్వీట్ చేసాడు. ఏప్రిల్ 17న ఈ చిఎన్మా ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచంలో ఫేమస్ అయిన చాలా మంది టెక్నీషియన్స్ ఈ సినిమా టెక్నికల్ టీంలో పని చేస్తున్నారు.

టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనంత భారీ బడ్జెట్ తో, భారీ సెట్స్ మరియు మతిభ్రమించే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇండియా, హాంక్ కాంగ్, యుఎస్ కి చెందినా 6 విఎఫ్ఎక్స్ టీమ్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా హీరో హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు