యాక్షన్ సీక్వెన్స్ తో బిజీగా ఉన్న ‘బాహుబలి’.

యాక్షన్ సీక్వెన్స్ తో బిజీగా ఉన్న ‘బాహుబలి’.

Published on Dec 18, 2014 9:43 AM IST

Bahubali
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, తమన్నాలు బల్గేరియాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

2015 వేసవిలో ‘బాహుబలి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతున్న మూవీ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నారు.

అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. తమిళంలో ‘మహాబలి’గా ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు