సెన్సార్ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’ ట్రైలర్

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’ ట్రైలర్

Published on May 24, 2015 3:48 PM IST

Bahubali
ఇండియన్ టెక్నికల్ స్టాండర్డ్స్ రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్ళడం కోసం ఎస్ఎస్ రాజమౌళి గత రెండేళ్లుగా ఎంతో శ్రమించి తీస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ మరియు ఆడియోని మే 31న రిలీజ్ చేస్తున్న విషయమే అందరికీ తెలిసిందే. ఆడియో లాంచ్ లో రిలీజ్ చేయనున్న ఫైనల్ ట్రైలర్ కట్ రెడీ అయ్యింది. ట్రైలర్ కి సంబందించిన సెన్సార్ కూడా పూర్తయ్యిందని, సెన్సార్ వారు ‘యు/ఏ’ ఇచ్చారని ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపాడు.

ఈ ట్రైలర్ రన్ టైం 2 నిమిషాలు ఉంటుందని సమాచారం. హైదరాబాద్ లోనే సరికొత్తగా ఈ మూవీ ఆడియో రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ లోపు ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ రోజు మార్చి రోజు ఈ చిత్ర టీం నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. రిలీజ్ చేసిన అన్ని పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసి జూలై 10న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు