డాల్బీ అట్మాస్ పరిజ్ఞానంతో బాహుబలి

డాల్బీ అట్మాస్ పరిజ్ఞానంతో బాహుబలి

Published on Dec 21, 2014 2:13 AM IST

Bahubali
రోజులు గడుస్తున్న కొద్దీ రాజమౌళి కలల వెంచర్ ‘బాహుబలి’ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సౌండ్ ఇంజనీరింగ్ లో జాతీయ అవార్డు గ్రహిత పి.ఏం సతీష్ సారధ్యంలో డాల్బీ అట్మాస్ సౌండ్ పరిజ్ఞానంలో విడుదలకానుంది.

ఈ డాల్బీ అట్మాస్ పరిజ్ఞానంద్వారా 3D సౌండ్ అనుభూతికలుగుతుంది. రియాలిటీకి దగ్గరగా వున్న ఈ పరిజ్ఞానాన్ని ఇదివరకు విశ్వరూపం సినిమాకు ఉపయోగించారు. ఇటువంటి ప్రయోగం చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం

ప్రస్తుతం బాహుబలి సినిమా బల్జేరియాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తుంది. అక్కడ నుండి వచ్చిన వెంటనే నిర్మాణాంతర పనులలో బిజీగా వుండనుంది. బాహుబలి మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు