నైజాంలో ఎవరూ టచ్ చేయలేని రికార్డ్ సృష్టించిన ‘బాహుబలి’

నైజాంలో ఎవరూ టచ్ చేయలేని రికార్డ్ సృష్టించిన ‘బాహుబలి’

Published on Aug 27, 2015 7:34 PM IST

Baahubali-pposter
జూలై 10న టాలీవుడ్ లో రిలీజ్ అయిన అద్భుతమైన విజువల్ వండర్ ‘బాహుబలి’. మన కళ్ళని రెప్ప వేయనీకుండా చేసే భారీ సెట్స్, ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని భారీ విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్, ఇవన్నీ చూస్తూ కూడా మనం చూస్తున్నది తెలుగు సినిమానేనా అని ఒకింత ఆశ్చర్యం, ఒకింత గర్వంగా ఫీలయ్యే అనుభవాన్ని కలిగించిన ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 49 రోజులయ్యింది, రేపటితో 50 రోజులు పూర్తి చేసుకోనుంది. మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి రోజు నుంచే అన్ని చోట్లా రికార్డ్స్ సృష్టించడం మొదలు పెట్టిన ఈ సినిమా మొదటి 50 రోజుల్లో వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో 600 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది.

ఓవరాల్ గానే కాకుండా ఏరియా ప్రకారం కూడా అన్నీ ఏరియాల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. నైజాంలో బాహుబలి అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి మొదటి 3ఓ రోజుల్లోనే 35కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం మొదటి 48 రోజుల్లో బాహుబలి సినిమా ఒక్క నైజాంలోనే 40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇప్పటి వరకూ అత్యధికం అంటే ‘అత్తారింటికి దారేది’ లాంగ్ రన్ లో 22 కోట్లు సాధించింది. ఇప్పుడేమో బాహుబలి ఆ సినిమాకి దాదాపుగా డబుల్ కలెక్ట్ చేసి ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డ్ ని సృష్టించింది. ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆర్కా మీడియా వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు