పాట చిత్రీకరణలో బాలకృష్ణ, త్రిష బిజీ..!

పాట చిత్రీకరణలో బాలకృష్ణ, త్రిష బిజీ..!

Published on Oct 1, 2014 8:00 AM IST

Trisha-in-Balayyas-next

‘లెజెండ్’తో బ్లాక్ బస్టర్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వెంటనే మరో సందేశాత్మక యాక్షన్ సినిమా ప్రారంభించారు. త్రిష ఈ సినిమాలో తొలిసారిగా బాలయ్యతో జోడి కడుతుంది. కొత్త దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

బాలకృష్ణ, త్రిషలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘హైసా అంబాని పిల్లా..’ అంటూ సాగే ఈ పాటను హైదరాబాద్ లో గల ఇనార్బిట్ మాల్, రామోజీ ఫిల్మ్ సిటీ తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతుంది. నేటితో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. శ్రీమణి రాసిన ఈ పాటకు మణిశర్మ హుషారైన బాణీ అందించారట.

ప్రేక్షకులకు కావల్సినంత యాక్షన్ తో పాటు సందేశాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సత్యదేవా. రాధికా ఆప్టే మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు