బాపును స్మరించుకున్న బాలకృష్ణ..

బాపును స్మరించుకున్న బాలకృష్ణ..

Published on Dec 22, 2014 1:01 PM IST

balakrishna
ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు, స్వర్గీయ శ్రీ బాపు గారితో మంచి అనుబంధం ఉంది. ఆదివారం జరిగిన బాపు ఫిల్మ్ ఫెస్టివల్ కు విచ్చేసిన బాలకృష్ణ ఆయన్ను స్మరించుకున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ… బాలకృష్ణ మళ్లీ పుట్టాలని, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను రంజింప చేయాలనీ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

బాపు చివరి సినిమా ‘శ్రీ రామ రాజ్యం’లో బాలకృష్ణ హీరోగా నటించారు. ‘శ్రీ రామ రాజ్యం’ వంటి గొప్ప సినిమాను నాకు అందించినందుకు ఎప్పటికీ బాపు గారికి రుణపడి ఉంటాను అని చెప్పారు. ఈ సందర్భంలో తమ మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ రిక్వెస్ట్ మేరకు బాపు మరియు రమణలు దూరదర్శన్ లో ప్రసారమైన ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం కొరకు ఆడియో విజువల్ రూపొందించినట్టు బాలకృష్ణ వెల్లడించారు.

లెజెండ్రీ దర్శకుడు బాపు గారి క్లాసిక్ పెయింటింగ్స్ ను తిరిగి ఇక్కడ కొలువుదీర్చిన నిర్వాహకులును బాలకృష్ణ అభినందించారు. అందరికీ ఆయన మధుర స్మృతులను మళ్లీ గుర్తు చేస్తున్నారు అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు