బాలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న బండ్ల గణేష్ ?

బాలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న బండ్ల గణేష్ ?

Published on Jan 18, 2017 9:12 PM IST

Bandla-Ganesh1
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బండ్ల గణేష్ గత కొన్నాళ్లుగా సినీ నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్నారు. ‘గబ్బర్ సింగ్, బాద్షా, గోవిందుడు అందరివాడే’ వంటి చిత్రాలు నిర్మించిన ఆయన చివరగా 2015లో జూ. ఎన్టీఆర్ తో ‘టెంపర్’ సినిమాని నిర్మించారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ హిట్ చిత్రం వరుస పరాజయాల్లో ఉన్న ఎన్టీఆర్ కెరీర్ను గొప్ప మలుపు తిప్పింది. ఇప్పుడు ఆ చిత్రంతోనే బండ్ల గణేష్ నిర్మాణ రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట.

టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రకి బాగా కనెక్టైన బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడట. ఈ రీమేక్ ను దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడని, అలాగే బండ్ల గణేష్ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బండ్ల గణేష్ మాత్రం ఇంకా చర్చలు జరుగుతుండగా ఈ విషయంపై మాట్లాడటం తొందరపాటవుతుందని సమాధానమిచ్చారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు