జోరుగా ‘భాగమతి’ అడ్వాన్స్ బుకింగ్స్ !

జోరుగా ‘భాగమతి’ అడ్వాన్స్ బుకింగ్స్ !

Published on Jan 25, 2018 1:15 PM IST

స్టార హీరోయిన్ అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం రేపే రిలీజ్ కానుంది. ‘బాహుబలి’ తర్వాత అనుష్క చేసిన చిత్రం కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్ బాగుండటంతో ప్రీ రిలీజ్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. అంతేగాక ఈ శుక్రవారం వేరే పెద్ద, చిన్న సినిమాలేవీ రిలీజ్ లేకపోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చే అంశంగా మారింది.

దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే నడుస్తున్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తునానఁ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన బలం కానున్నాయి. అంతేగాక సినిమా మొత్తాన్ని 4కే టెక్నాలజీతో చిత్రీకరించడం మరో విశేషం. దీనివలన ప్రేక్షకులకు క్వాలిటీ ఫిల్మ్ చుసియాన్ అనుభూతి కలుగులుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. జి.అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, జైరామ్ వంటి వారు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు