28న భయపెట్టడానికి వస్తున్న ‘భూ’

28న భయపెట్టడానికి వస్తున్న ‘భూ’

Published on Nov 24, 2014 12:50 PM IST

bhoo
కత్తి మహేష్ సమర్పణలో క్లాప్ బోర్డ్ స్టూడియోస్ పతాకంపై ‘సశేషం’ ఫేం శ్రీకిషోర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భూ’. సుప్రియ ఐసొల ప్రధాన పాత్రలో నటించారు. ధనరాజ్, జీవా ఇతర పాత్రధారులు. నిర్మాణంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలు తెలియజేయడానికి చిత్రబృందం మీడియాతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి ‘హృదయ కాలేయం’ దర్శకుడు సాయి రాజేష్(స్టీవెన్ శంకర్) అతిధిగా హాజరయ్యారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం హారర్ ఫిల్మ్ ట్రెండ్ నడుస్తుంది. ఇటీవల విడుదలైన హారర్ సినిమాలలో ‘భూ’ డిఫరెంట్ సినిమాగా నిలుస్తుంది. నేను సినిమా చూశాను కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను. సినిమాలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. క్లైమాక్స్ లో నాలుగు కథలు ఎలా కలిశాయి అనేది ‘భూ’ సినిమా. దర్శకనిర్మాత సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. హాంకాంగ్ తదితర ఫారిన్ లొకేషన్లలో షూటింగ్ చేశాడు. సినిమా పట్ల ఫ్యాషన్ కల వ్యక్తి. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అని అన్నారు.

సమర్పకులు కత్తి మహేష్ మాట్లాడుతూ.. నిఖార్సయిన హారర్ సినిమా ‘భూ’. ఇటీవల హారర్ నేపధ్యంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను భయపెట్టకుండానే థియేటర్ నుండి వెళ్లిపోతున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను భయపెడుతుంది. విడుదల కొరకు చాలా కష్టాలు పడిన తర్వాత ఈ నెల 28న మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 70 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు సినిమా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అని అన్నారు.

తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్టు దర్శకనిర్మాత శ్రీకిషోర్, హీరోయిన్ సుప్రియ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు