మణిరత్నం ‘బంగారం’ పై బిగ్ బి ప్రశంసలు

మణిరత్నం ‘బంగారం’ పై బిగ్ బి ప్రశంసలు

Published on Apr 24, 2015 6:00 PM IST

maniratnam-amithab
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఓకే బంగారం చిత్రం ఇటీవలే విడుదలై అద్బుతంగా ప్రదర్శించబడుతున్నది. విమర్శకులచేత కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నది. హీరో హీరోయిన్ ల మధ్య ఉన్న సంబంధాన్ని అద్బుతంగా తెరకెక్కించాడు మణిరత్నం. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్రస్తుతం మంచి వసూళ్ళు సాధిస్తున్నది. భారతీయ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన పెద్ద పెద్ద నటుల నుంచి కూడా మణిరత్నం ప్రశంసలు అందుకుంటున్నారు.

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవలే తన కూతురుతో కలిసి ఓకే బంగారం చిత్రాన్ని చూశారు. హీరో దుల్కీర్ సల్మాన్, హీరోయిన్ నిత్యామీనన్ మధ్య కెమిస్ట్రీ అద్బుతంగా కుదిరిందని అన్నారు. మారుతున్న తరాల భావనను దృష్టిలో ఉంచుకొని మణిరత్నం ఈ చిత్రాన్ని అద్బుతంగా నిర్మించారని అమితాబ్ ప్రశంసించారు. రొమాంటిక్ ప్రేమకధగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఏఆర్ రెహమాన్ అందించిన స్వరాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు