బిగ్ బాస్ బ్యాచ్ గెట్ టు గెదర్…!

బిగ్ బాస్ బ్యాచ్ గెట్ టు గెదర్…!

Published on Nov 17, 2019 2:31 PM IST

తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా ముగిసిన ఈ షో సూపర్ సక్సెస్ ఐయ్యింది. 17మందికి పైగా కంటెస్టెంట్స్ తో వంద రోజులకు పైగా జరిగిన ఈ షోలో వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి టాప్ ఫైవ్ కి చేరగా వారిలో రాహుల్, శ్రీముఖి ఫైనల్ కి చేరుకున్నారు. వీరిద్దరిలో ఉత్కంఠ మధ్య రాహుల్ విన్నర్ గా నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా రాహుల్ ని విన్నర్ గా నిర్ణయించారు. చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

నెలల తరబడి ఒకే ఇంటిలో కలిసి ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ టుగెదర్ ఐయ్యారు. వీరందరూ కలిసి హ్యాపీగా పార్టీ చేసుకున్నారు. ఐతే ఈ పార్టీ లో బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ నుండి హిమజ, మహేశ్‌, పునర్నవి, వరుణ్‌, వితిక, అలీ అతని భార్య మసుమా మాత్రమే పాల్గొన్నారు. టైటిల్ విన్నర్ రాహుల్, రన్నర్ శ్రీముఖి మరియు పునర్నవి కనిపించలేదు. సింగరైన రాహుల్ తన పనిలో బిజీగా ఉండగా, యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ అనంతరం ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ వెళ్లారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు