‘బాహుబలి 2’ ప్రెస్ మీట్ లో బిగ్ స్క్రీన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు !

‘బాహుబలి 2’ ప్రెస్ మీట్ లో బిగ్ స్క్రీన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు !

Published on Sep 30, 2016 12:49 PM IST

baahubali-screen

‘బాహుబలి’ అభిమానాలు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఈరోజు సాయంత్రం దస్పల్లా హోటల్లో 6 గంటల 30 నిముషాలకు ‘బాహుబలి 2’ చిత్రం యొక్క ప్రెస్ మీట్ మొదలుకానుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు ప్రధాన తారాగణం ప్రభాస్, రానా, అనుష్కలు హాజరవుతున్నారు. దీంతో ఏర్పాట్లన్నీ భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రెస్ మీట్లో భారీ స్థాయి ఎల్ఈడీ స్క్రీన్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు.

మామూలుగా ప్రెస్ మీట్ అంటే దర్శకుడు, ఇతర నటీనటులు సినిమా కథ, షూటింగ్ విశేషాలు, మ్యూజిక్, టీజర్, ట్రైలర్, సినిమా విడుదల గురించిన సంగతులు చెబుతారు. అలాంటి ప్రకటనలకు స్క్రీన్ అవసరం లేదు. మరి జక్కన్న స్క్రీన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు. ఒకవేళ సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియోగాని, ఇతర విజువల్స్ గాని ప్రదర్శించే అవకాశమేమన్నా ఉందా అన్న ఆశలు కూడా అభిమానుల్లో రేగుతున్నాయి. ఏమో ఎప్పుడూ అభిమానుల అంచనాలకు తగ్గట్టు భారీ స్థాయి అవుట్ ఫుట్ ఇచ్చే రాజమౌళి ఇప్పుడు కూడా అలాంటిదేమన్నా చేస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు